Header Banner

ఏపీ మీదుగా బుల్లెట్ ట్రైన్! ఈ రూట్‌లోనే, భూసేకరణకు రెడీ!

  Mon Jun 02, 2025 09:04        Others

ఆంధ్రప్రదేశ్ గుండా బుల్లెట్ రైలు పరుగులు పెట్టనుంది. చెన్నై నుండి మైసూరు వరకు 463 కిలోమీటర్ల మేర బుల్లెట్ రైలు మార్గాన్ని కేంద్రం ప్రతిపాదించింది. ఇందులో భాగంగా చిత్తూరు జిల్లాలో 77 కిలోమీటర్ల మేర పలమనేరు, బంగారుపాళ్యం మీదుగా రైలు మార్గం వెళ్లనుంది. పలమనేరు దగ్గర ఒక స్టాపింగ్ ఉండేలా ప్రణాళికలు చేస్తున్నారు. ప్రస్తుతం అధికారులు 41 గ్రామాల పరిధిలో భూసేకరణ పనులు చేస్తున్నారు.

 

ఆంధ్రప్రదేశ్ మీదుగా బుల్లెట్ ట్రైన్ పరుగులు తీయనుంది. మైసూరు వరకు బుల్లెట్ ట్రైన్‌తో పాటుగా చెన్నై నుంచి బెంగళూరుకు ఎక్స్‌ప్రెస్ వే రానున్నాయి. ఈ క్రమంలో కేంద్రం ఆదేశాలతో సర్వే, భూసేకరణ పనులు మొదలయ్యాయి. నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (NHSRCL) ఆధ్వర్యంలో ఈ పనులు జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా భూసేకరణ కూడా చేస్తున్నారు. కేంద్రం చెన్నై-మైసూరు మధ్య బుల్లెట్ రైలు 463 కి.మీ దూరం ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు చిత్తూరు జిల్లాలో 77 కిలోమీటర్ల మేర పలమనేరు, బంగారుపాళ్యం మీదుగా వెళ్తుంది. ఈ రైలు మార్గంలో మొత్తం తొమ్మిది స్టాపింగ్‌లు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.. అందులో పలమనేరు మండలంలోని 190-రామాపురం దగ్గర ఒక స్టాపింగ్ ఉంటుందని చెబుతున్నారు.

 

ఇది కూడా చదవండి: టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలుకు కీలక బాధ్యతలు అప్పగించిన కేంద్రం! ఎన్డీఏ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ..!


ఈ మేరకు ఈ బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు సంబంధించి NHSRCL జీఎం నిషాంత్ సింఘాల్ ఆధ్వర్యంలో పనులు జరుగుతున్నాయి. చిత్తూరు జిల్లాలో అధికారులు 41 గ్రామాల పరిధిలో భూమిని సేకరిస్తున్నారు. దాదాపు 876 మంది రైతుల నుండి భూమిని సేకరించే పనిలో ఉన్నారు. దీని కోసం ఇప్పటికే సర్వే చేసి ఆయా భూముల్లో రాళ్లు కూడా పాతుతున్నారు. చిత్తూరు జిల్లా పలమనేరు మండలంలోని జల్లిపేట, కూర్మాయి, మొరం, కొలమాసనపల్లె, పలమనేరు, పెంగరగుంట, సముద్రపల్లె వంటి ఊర్లలో భూసేకరణ చేస్తున్నారు. బైరెడ్డిపల్లె మండలంలో కంభంపల్లె, శెట్టిపల్లె, బేలుపల్లె, ఆళ్లపల్లె, లక్కనపల్లె ఊర్లలోకూడా భూసేకరణ, లైన్ అలైన్‌మెంట్ పనులు చేపట్టారు. ఈ మేరకు ప్రాజెక్ట్ కోసం సర్వే, భూసేకరణ మొదలుపెట్టారని చెబుతున్నారు అధికారులు.

 

 

కేంద్రం దేశవ్యాప్తంగా బుల్లెట్ రైళ్లను నడపాలని ప్లాన్ చేస్తోంది.. ఈ మేరకు ఆయా రూట్లలో సర్వేలు కూడా చేయించింది.. ప్రస్తుతం భూ సేకరణ పనులు మొదలయ్యాయని చెబుతున్నారు. ఇప్పటికే ముంబై నుంచి అహ్మదాబాద్ వరకు నడిచే బుల్లెట్ రైలు పనులు వేగవంతం చేశారు. ఈ మేరకు బుల్లెట్ రైలు దూసుకెళ్లే 300 కిలోమీటర్ల వయాడక్ట్ (రైల్వే బ్రిడ్జి) పనులు పూర్తయ్యాయి.

 

ఇది కూడా చదవండి: మెగా డీఎస్సీ పరీక్షల షెడ్యూల్‌లో ఈ మార్పులు గమనించారా..? వారికి నో ఛాన్స్..!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు

 

రేషన్ కార్డు దారులకు అలర్ట్! రేషన్‌ కొత్త టైమింగ్స్‌, తేదీలు ఇవే..!

 

ఏపీ ప్రభుత్వం మరో అలర్ట్..! వీళ్లు ఇళ్లలో నుంచి అస్సలు రావొద్దు..!

 

ఏపీలో మళ్లీ మొదలైన రేషన్ షాపులు! క్యూ కట్టిన జనం!

 

ఏపీ ప్రజలకు ప్రభుత్వం బంపరాఫర్..! ఆ ప్లాట్లు వేలంలో దక్కించుకునే మంచి ఛాన్స్!

 

 రేషన్‌ వద్దనుకుంటే డీబీటీ పద్ధతిలో డబ్బులు! సీఎం చంద్రబాబు!

 

ఏపీలో టీచర్ ఉద్యోగాలకు తీవ్ర పోటీ! ఒక్కో పోస్టుకు సగటున 35 మంది!

 

ఏపీలో వారందరికీ గుడ్‌న్యూస్..! ఒక్కొక్కరికీ రూ.15 వేలు అకౌంట్లలోకి డబ్బులు!

 

పేదలకు శుభవార్త..! ఫించన్ల పెంపుపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!

 

తల్లులు, విద్యార్థులకు భారీ శుభవార్త..! ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం!

 

ఈ 100 రూపాయలు మీ దగ్గర ఉన్నాయా..! అరెస్ట్ అవుతారు జాగ్రత్త!

 

ఇంజినీరింగ్ విద్యార్థులకు గోల్డెన్ ఛాన్స్..! BEL నోటిఫికేషన్ రిలీజ్!

 

ఏపీలో 10 అద్భుతమైన బీచ్‌లు.. ఈ హిడన్ జెమ్స్ లాంటి బీచ్‌లను మిస్ అవ్వకండి..

 
ఏపీలో కొత్తగా ఐకానిక్ కేబుల్ బ్రిడ్జ్.. నేషనల్ హైవేకు కనెక్ట్! ఈ రూట్‌లోనే, డీపీఆర్ పనులు..!

 

వైసీపీకి దిమ్మ తిరిగే షాక్! టీడీపీ కార్యకర్తపై దాడి కేసులో కీలక నిందితుడు అరెస్ట్!

 

రూ.500 కోట్ల కుంభకోణంలో కిరణ్ అరెస్ట్! దర్యాప్తులో వారి వివరాలు వెల్లడి!

 

కవిత కు కేసీఆర్ మార్క్ ట్రీట్మెంట్..! హరీష్ కు కీలక బాధ్యతలు..!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #BulletTrain #ChennaiToMysuru #HighSpeedRail #NHSRCL #AndhraPradeshDevelopment #PalamanerStop #ChittoorDistrict #LandAcquisition